ఎయిర్పోర్టులో ఇద్దరి నుంచి 30 లక్షల విలువైన బంగారం పేస్ట్ స్వాధీనం
హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయంలో మరోమారు బంగారం స్మగ్లర్లు పట్టుబడ్డారు. ఢిల్లీకి వెళ్లేందుకు గురువారం ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికుడు సెక్యూరిటీ హోల్డ్ ఏరియా(ఎస్హెచ్ఏ)కు వచ్చేటప్పుడు అనుమానాస్పదంగా నడవడాన్ని సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ రాజేందర్సింగ్ గుర్తించారు. సోదాచేయగా బూట్లలో రెండు బంగారం పేస్ట్ ప్యాకెట్లు లభించాయి. అతడిచ్చిన సమాచారంతో మరో ప్రయాణికుడి నుంచి కూడా బంగారం పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి వద్ద రూ.30 లక్షల విలువైన 626.40 గ్రాముల బంగారం లభ్యమైందని అధికారులు తెలిపారు. నిందితులను మహ్మద్ మరూఫ్, మహ్మద్ తారిఖ్పై కేసులు నమోదు చేశారు.