చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆయన తండ్రి కరుణానిధి సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ ఉదయం 9 గంటలకు రాజ్భవన్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన నేరుగా చెన్నైలోని తన తండ్రి కరుణానిధి స్మృతిచిహ్నం వద్దకు వెళ్లారు. అక్కడ కరుణానిధి చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సమాధిపై పుష్పగుచ్ఛాన్ని ఉంచి అంజలి ఘటించారు.