ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
పాజిటివ్ వచ్చిన వారు హోం హైసొలేషన్లోనే ఉండాలి
నర్సంపేట ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జాన్సన్
నర్సంపేట, మే 9: కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని నర్సంపేట ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జాన్సన్ సూచించారు. ఆదివారం ఆయన పట్టణంలో కరోనా నిర్ధారణ పరీక్షలను పరిశీలించారు. పాజిటివ్ వచ్చిన వారు విధిగా హోం ఐసొలేషన్లోనే ఉండాలని కోరారు. తరచూ ఆక్సిజన్ శాతం తెలుసుకోవాలన్నారు. ఏరియా దవాఖానలో 30 బెడ్స్ అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 11 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. 36 మందికి పరీక్షలు చేయగా, 22 మందికి పాజిటివ్ వచ్చిందని అన్నారు.
ముమ్మరంగా వ్యాక్సినేషన్
దుగ్గొండి/చెన్నారావుపేట, మే 9: దుగ్గొండి, కేశవాపురం పీహెచ్సీల్లో వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారులు స్వప్న, రాజు తెలిపారు. కేశవాపురం పీహెచ్సీలో 25 మందికి, దుగ్గొండిలో 30 మందికి టీకాలు వేశారు. ఈ సందర్భంగా కేశవాపురం వైద్యాధికారి స్వప్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. చెన్నారావుపేటలోని పీహెచ్సీలో 30 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి ఉషారాణి తెలిపారు.