ముంబై, మే 9: జాతీయస్థాయిలో ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పాటుకు చర్చలు కొద్దిరోజుల్లో ప్రారంభమవుతాయని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. ఆ కూటమికి ఆత్మగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పారు. ‘దేశంలో ప్రతిపక్ష పార్టీలతో బలమైన కూటమి అవసరం ఉన్నది. అయితే కాంగ్రెస్ లేకుండా అలాంటి కూటమి ఉండదు. ఆ పార్టీయే ఆత్మ అవుతుంద’ని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో చర్చించినట్టు చెప్పారు. ‘సిద్ధాంతపరంగా భిన్నమైన మూడు పార్టీలు (శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్) కలిసి మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీని (ఎంవీఏ) ఏర్పాటు చేశాయి. నాయకత్వాన్ని ఉద్ధవ్ ఠాక్రేకి అప్పగించాయి. చక్కగా పనిచేస్తున్న ఈ కూటమి ఒక ఆదర్శమ’ని అన్నారు.