National
- Jan 02, 2021 , 16:25:30
బస్సును అపహరించిన తాలిబన్లు.. బంధీలుగా 45 మంది ప్రయాణికులు!

హెరాత్: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. గత రాత్రి పోలీసులపై దాడి చేసి ఆరుగురి ప్రాణాలు తీసిన ఘటనను మరువకముందే తాజాగా మరో దారుణానికి పాల్పడ్డారు. ఏకంగా 45 ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సును అపహరించి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. ఆఫ్ఘినిస్థాన్లోని హెరాత్ ప్రావిన్స్లో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. హెరాత్ సిటీ-తుర్గుంది రహదారిపైగల చిల్డోఖ్తారన్ ఏరియా నుంచి ఉగ్రవాదులు బస్సును అపహరించారు. ఆఫ్ఘనిస్థాన్ మీడియా సంస్థ షంషద్ న్యూస్ ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి తాలిబన్లు ఇంకా ఎలాంటి స్పందన తెలియజేయలేదు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కమలాహారిస్కు అభినందనలు తెలిపిన మైక్ పెన్స్
- కరోనా నియంత్రణ చర్యలు అద్వితీయం : మంత్రి పువ్వాడ
- ఆక్సిజన్ సిలిండర్ల కోసం భారీ క్యూ లైన్లు..
- వ్యాక్సిన్పై అపోహలు అవసరం లేదు : మంత్రి గంగుల కమలాకర్
- తెలుగు రాష్ర్టాల సీఎంలకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి లేఖ
- సోనూసూద్ టైలరింగ్ షాప్.. కస్టమర్ దుస్తులకు నో గ్యారంటీ! ..వీడియో వైరల్
- రామ్ చరణ్, రోజా.. ఇద్దరూ ఇష్టపడేది ఆ హీరోనే
- టీకా దుష్ప్రభావాలపై పరిహారం పొందాలంటే..
- టెస్లాతో భాగస్వామ్యమా? నో వే అంటున్న టాటా
- కరోనా 'పేషెంట్ జీరో'ను ఎన్నటికీ గుర్తించలేం..
MOST READ
TRENDING