న్యూఢిల్లీ: తమ ఆదేశాలను బేఖాతరు చేసి ఎన్నికల సంబరాలను జరుపుకుంటున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశంలో కొవిడ్ సంక్షోభం కారణంగా విజయోత్సవ ర్యాలీలు, సంబరాలపై ఈసీ నిషేధం విధించింది. అయినా కూడా ఈ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో ఆయా పార్టీల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ.. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.