న్యూఢిల్లీ : రాష్ర్టాలు లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తుండటంతో మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో రద్దీ నెల కొంటున్నదని, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించట్లేదని కేంద్రం ఆందో ళన వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులను నిశితంగా పరిశీలించి.. కార్యకలాపాలను పునఃప్రారంభించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. వైరస్కు అడ్డుకట్టవేసేందుకు టెస్టింగ్, ట్రాకింగ్, చికిత్స, వ్యాక్సినేషన్, నిఘా వంటి నియమాలను పాటించాలని సూచించింది.