లక్నో: ఉత్తర ప్రదేశ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్మహల్ పేరు త్వరలో రామ్మహల్గా మారుతుందని తెలిపారు. బైరియా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆగ్రాలోని తాజ్మహల్ ఒకప్పుడు శివాలయం అని అన్నారు. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజ్మహల్ పేరును త్వరలో రామ్మహల్గా మార్చుతుందని చెప్పారు.
అంతేగాక యోగి ఆదిత్యనాథ్ను శివాజీ వారసుడితో సురేంద్ర సింగ్ పోల్చారు. ‘శివాజీ వారసులు ఉత్తరప్రదేశ్కు వచ్చారు. సమర్ గురువు రామ్దాస్ భారతదేశానికి శివాజీని ఇచ్చినట్లే, గోరఖ్నాథ్ జీ యోగి ఆదిత్యనాథ్ను ఉత్తరప్రదేశ్కు ఇచ్చారు’ అని వ్యాఖ్యానించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.