ఎదులాపురం, ఏప్రిల్ 10 : ఆదిలాబాద్ జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన వచ్చింది. కక్షిదారులు ఉదయం 10 గంటలకే బారులుతీరారు. మాస్కు ధరించినవారికే కోర్టులోకి అనుమతించారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న క్రిమినల్, సివిల్, భూతగాదాలు, కుటుంబ కలహాల కేసులు, బ్యాంక్ రికవరీ, చిట్ఫండ్స్ , వివిధ కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలత్లో రాజీ కుదర్చుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీఎస్. జగ్జీవన్ కుమార్ మాట్లాడుతూ రాజీమార్గమే రాచమార్గం అని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ( 7807) కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కేసుల్లో 21 మందికి రూ.50 లక్ష చెక్కులు అందజేశామన్నారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమ దేశ్పాండే మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో ఆదిలాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్ రావు, న్యాయమూర్తులు ఉదయ్ బాస్కర్రావు, ఆరుణకుమారి, యశ్వత్ సింగ్ , బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణారెడ్డి, కార్యదర్శి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షుడు దేవేందర్. న్యాయవాదులు, సంజయ్కుమార్ పాల్గొన్నారు.
సింగరేణి ప్రగతికి పాటుపడాలి
జీఎం చింతల శ్రీనివాస్
24 మందికి కారుణ్య నియామక పత్రాల అందజేత
మందమర్రి రూరల్, ఏప్రిల్ 10 : సింగరేణి సంస్థ ప్రగతికి పాటుపడాలని ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో 24 మంది యువకులకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు, ఐదు ఏళ్లు అండర్ గ్రౌండ్ లో విధులు నిర్వహించాలన్నారు. ఇప్పటివరకు ఏరియాలో మొత్తం 956 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎస్. సత్యనారాయణ, టీబీజీకేఎస్ నాయకుడు రమణ, పీఎం వరప్రసాద్, డీవైపీఎం శ్యాంసుందర్, పర్సనల్ డిపార్టుమెంట్ అధికారి రాయలింగు పాల్గొన్నారు.
పీహెచ్సీ సందర్శన
రెబ్బెన,ఏప్రిల్10: మండలకేంద్రంలోని పీహెచ్సీని డిప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్నాయక్ శనివారం సందర్శించారు. వ్యాక్సినేషన్ తీరును పరిశీలించారు. ఆయన వెంట డాక్టర్ భరత్, సూపర్వైజర్ రుతుక్లారా, హెల్త్ అసిస్టెంట్లు ప్రవీణ్, కమలాకర్, సిబ్బంది ఉన్నారు.
కోఆర్డినేటర్, ఏఎస్వోల నియామకం
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 10: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లాలకు 14మంది కోఆర్డినేటర్లు, ఏఎస్వోలను నియమిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు, మూడు రోజుల్లో ఆయా పాఠశాలల నుంచి రిలీవ్ అయి విద్యాశాఖ కార్యాలయాల్లో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో సమగ్ర శిక్ష అభియాన్ లో ఏడాది పాటు ఆయా పోస్టుల్లో కొనసాగనున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ఐదుగురిని కేటాయించగా కంటె నర్సయ్య, జే నారాయణ, ఉదయశ్రీ, సుజాత్ఖాన్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్గా రంగినేని సూరజ్రావ్ను నియమించారు. నిర్మల్కు కోఆర్డినేటర్లుగా సామల రాజేశ్వర్, నుగురి ప్రవీణ్ కుమా ర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారిగా నాగుల రవిని నియమించారు. మంచిర్యాల్కు కోఆర్డినేటర్గా కే చౌదరి, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్గా పొద్దుటూరి శ్రీనివాస్, కుమ్రం భీం ఆసిఫాబాద్కు కోఆర్డినేటర్లుగా భరత్, అదిక్కి సత్యనారాయణ మూర్తి, సత్తయ్య జంబోజు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్గా సయ్యద్ అబిద్ అలీను నియమించారు.
ఆసిఫాబాద్ జిల్లాలో 141 పాజిటివ్ కేసులు
ఆసిపాబాద్ అంబేద్కర్చౌక్, ఏప్రిల్ 10 : జిల్లాలో శనివారం 141 పా జిటివ్ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. లిం గాపూర్లో 76, బెజ్జుర్ 6 , దహెగాం 1, జైనూర్ 14, కాగజ్నగర్ 11, కెరమెరి 4, కౌటాల 2, రెబ్బెన 4, సిర్పూర్ టీ 3, సిర్పూర్ యూ 4, తిర్యాణి 2, ఆసిఫాబాద్లో 14 చొప్పున కేసులు వచ్చాయని తెలి పారు. ప్రతి ఒక్క రూ కొవిడ్ నిబంధనలు పాటిస్తే వైరస్ నియంత్రణ సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
IPL 2021: దంచికొడుతున్న ఢిల్లీ ఓపెనర్లు
శ్రీశైల ప్రభ సంపాదకుడు అనిల్ కుమార్కు పదోన్నతి