కరోనా తీవ్రమవుతున్నది.. టీకాలకు ప్రాధాన్యమివ్వండి: బీజేపీ నేత సువేందు
కోల్కతా: కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉప ఎన్నికల నిర్వహణ సరికాదని పశ్చిమబెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి పేర్కొన్నారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయించడానికి ప్రాధాన్యమివ్వాలని బెంగాల్ సర్కారుకు స్పష్టంచేశారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. బెంగాల్లో ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నది. దీనిపై శుక్రవారం సువేందును మీడియా ప్రశ్నించగా.. కరోనా కేసులు పెరుగుతున్న ఇలాంటి సమయంలో ఉపఎన్నికలు అవసరం లేదన్నారు. కేసుల సంఖ్యను తక్కువగా చూపిస్తూ బెంగాల్ సర్కారు ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. బెంగాల్తోపాటు మధ్యప్రదేశ్లో 3, ఉత్తరప్రదేశ్లో 6, ఉత్తరాఖండ్లో 2, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగాల్సి ఉన్నది.