నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న నందిగ్రామ్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి. పోస్టల్ బ్యాలెట్లో సువేందుకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్లో సువేందుకు 7287 ఓట్లు, మమతకు 5790 ఓట్లు వచ్చాయి. మరోవైపు రాష్ట్రంలో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ నడుస్తోంది. ఈసారి పశ్చిమ బెంగాల్లో బీజేపీ బలంగా పుంజుకుంది. అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది.