నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురయ్యేలా కనిపిస్తోంది. నందిగ్రామ్లో మూడు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి మమతపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 7287 ఓట్ల ఆధిక్యంలో ఉండటం విశేషం. బ్యాలెట్ ఓట్లతోపాటు తొలి రౌండ్ నుంచే సువేందు ఆధిక్యంలో ఉంటూ వస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ నడుస్తోంది. అయితే ప్రస్తుతానికి టీఎంసీ 146 స్థానాల్లో, బీజేపీ 116 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.