కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఇవాళ వాకౌట్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. నందీగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓడిపోయినట్లు ప్రతిపక్ష నేత సువేందు అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో రగడ మొదలైంది. టీఎంసీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య సభలో వాగ్వాదం జరిగింది. నందీగ్రామ్లో సీఎం మమతా బెనర్జీ ఓడిన విషయాన్ని తాను సభలో లేవనెత్తానని, కానీ ఆ అంశం కోర్టులో ఉన్నట్లు స్పీకర్ తెలిపారని, అలాంటప్పుడు తానెందుకు సభలో ఉండాలని వాకౌట్ చేసినట్లు సువేందు అధికారి తెలిపారు. ఏప్రిల్లో ముగిసిన ఎన్నికల్లో నందీగ్రామ్లో సువేందు, మమత మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. చాలా స్వల్ప ఓట్ల తేడాతో సువేందు గెలిచారు.