మెదక్ మున్సిపాలిటీ, మే 9 : జిల్లా కేంద్రంలో లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగుతున్నది. ఆదివారం నాటికి పన్నెండో రోజుకు చేరింది. మధ్యాహ్నం 2 నుంచి ఉదయం 6 గంటల వరకు వ్యాపార, వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. అత్యవసర సేవలైన దవాఖానలు, మెడికల్ షాపులు మాత్రమే తెరిచి ఉంటున్నాయి. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటిస్తూ భౌతిక దూరం పాటించాలని మున్సిపల్ కమిషనర్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రామాయంపేటలో సెల్ఫ్లాక్డౌన్..
రామాయంపేట, మే 9 : పట్టణంలో సెల్ఫ్లాక్ డౌన్ కొనసాగుతున్నది. మున్సిపల్ పాలకవర్గం తీర్మా నం మేరకు దుకాణాదారులు షాపులను మూసివేస్తున్నారు. పట్టణ వ్యా పారులు లాక్డౌన్కు సహకరిస్తున్నారు. మండలంలోని డీ.ధర్మారం, లక్ష్మాపూర్, తొనిగండ్ల, జాన్సిలింగాపూర్, కోనాపూర్, కాట్రియాల గ్రామాల్లో లాక్డౌన్ విధించారు. పోలీసులు మధ్యాహ్నం 2 నుంచి ఉదయం 6గంటల వరకు గస్తీ చేపడుతూ.. మాస్క్ లేనివారికి జరిమానా విధిస్తున్నారు. పట్టణంలోని మెదక్, సిద్దిపేట రోడ్డుతోపాటు పాతజాతీయ రహదారుల వెలవెలబోతున్నాయి.