న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల పెరుగుదల కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8న రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవుతారు. సీఎంలతో భేటీ సందర్భంగా ప్రధాని దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై సమీక్షించనున్నారు.
కొవిడ్-19 కట్డడికి తీసుకోవాల్సిన చర్యలపైఈ భేటీలో సీఎంల నుంచి ప్రధాని సూచనలు స్వీకరించడంతో పాటు, విలువైన సమాచారాన్ని పంచుకోనున్నారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిపై ప్రధాని మోదీ రాష్ట్రాల ప్రభుత్వాధినేతలతో ఎప్పటికప్పుడు పరిస్ధితిని మదింపు చేయడంతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై తరచూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ తరహాలో కఠిన నియంత్రణలకు పూనుకున్నాయి.