న్యూఢిల్లీ, ఆగస్టు 16: కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితాదేవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. సోమవారం ఆమె తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. కోల్కతాలో ఆ పార్టీ నేత అభిషేక్ బెనర్జీ సమక్షంలో సుస్మిత తృణమూల్ కండువా కప్పుకున్నారు. మాజీ ఎంపీ అయిన సుస్మిత.. జాతీయ అధికార ప్రతినిధిగా, అఖిల భారత మహిళా కాంగ్రెస్ చీఫ్గా పనిచేశారు.