అమరావతి: ఈ రోజుల్లో చాలామంది చిన్నచిన్న విషయాలకే పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. కొందరు ఎదుటివాళ్ల ఉసురు తీయడానికి కూడా ఏమాత్రం వెనుకాడకపోగా, మరికొందరు తమంతట తామే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
తాజాగా పశ్చిగోదావరి జిల్లా భీమవరంలో అలాంటి ఘటనే చోటుచేసుకున్నది. ఎస్టీ కాలనీకి చెందిన సత్య అనే మహిళ కూతురు పుట్టిన రోజునాడు కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్దాం అని భర్తను కోరింది. కానీ అందుకు ఆమె భర్త దొడ్డ సురేష్ ఒప్పుకోలేదు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన సత్య ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
వెంటనే కుటుంబసభ్యులు ఆమెను కిందకు దించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. భీమవరం టూటౌన్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.