ముంబై: జాతీయ ఫిల్మ్ అవార్డు గ్రహీత, బాలీవుడ్ నటి సురేఖా సిక్రి ఇవాళ గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 75 ఏళ్లు. ఇటీవల బదాయి హో చిత్రంతో పాటు బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు) లాంటి టీవీ షోల్లోనూ ఆమె నటించారు. 2020లో ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అప్పటి నుంచి ఆమె అనారోగ్యంగా ఉన్నారు. సురేఖా సిక్రి తుదిశ్వాస విడిచినట్లు ఆమె మేనేజర్ తెలిపారు. సురేఖ మూడుసార్లు జాతీయ ఫిల్మ్ అవార్డులను గెలుచుకున్నారు. తమాస్, మమ్మో, సాలిమ్ లంగ్డే పే మత్ రో, జుబేదా, బాలికా వధు లాంటి సీరియళ్లలో నటించారు. 2018లో రిలీజైన బదాయి హో చిత్రంలో ఆమె హీరో ఆయుష్మాన్ ఖుర్హాన్కు నానమ్మ పాత్రలో నటించారు.ఈ సినిమా ద్వారా ఆమెకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు దక్కింది. జోయా అక్తర్ డైరక్ట్ చేసిన గోస్ట్ స్టోరీస్ లో నటించిందామె.