హైదరాబాద్ : ఈ నెల 23 నుంచి హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. దాదాపు 15 నెలల తర్వాత ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మార్చి 23న ఎంఎంటీఎస్ రైళ్ల సేవలు నిలిచిపోయాయి. ముందుగా 10 ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నారు. క్రమంగా ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.