దుర్గమ్మకు ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి ప్రత్యేక పూజలు
పలు ఆలయాల్లో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, భూపాల్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి పూజలు
పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు
పాపన్నపేట,20ఏప్రిల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడడంతో రాష్ట్ర ప్రజానీకం తల్లడిల్లి పోతున్నదని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరిసుభాశ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఏడుపాయల వనదుర్గాభవానీ మాతను దర్శించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యావత్ మానవాళిని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ నిర్మూలన జరగాలని, ముఖ్యమంత్రి కేసీఆర్కు త్వరగా స్వస్థత చేకూరాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. మంగళవారం వెల్దుర్తి మండల పరిధిలోని శెట్టిపల్లి, కొంగోడు చెక్డ్యాంలకు కాళేశ్వరం నీళ్లు చేరుకున్నాయని, నేడు పవిత్రమైన శ్రీరామనవమి రోజున నీళ్లు మెదక్ మండలంలోకి ప్రవేశించి బొల్లారం మత్తడికి చేరుకోనున్నట్లు వెల్లడించారు.
కేసీఆర్ పేరున ప్రత్యేక పూజలు
ఎమ్మెల్సీ శేరిసుభాశ్రెడ్డి ఏడుపాయలకు చేరుకోగానే ఆలయ ఈవో సార శ్రీనివాస్, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, ఆలయ ఈవో శాలువాతో సన్మానించారు. ఆయన వెంట పాపన్నపేట మండల మాజీ టీఆర్ఎస్ అధ్యక్షుడు పుల్లన్నగారి ప్రశాంత్రెడ్డి, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, రామాయంపేట ఏఎంసీ మాజీ చైర్మన్ గంగానరేందర్, పాపన్నపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుమ్మరిజగన్, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రమేశ్, టీఆర్ఎస్ నాయకులు జీవన్రావు, సాతెల్లి బాలాగౌడ్, వైస్ ఎంపీపీ విష్ణువర్దన్రెడ్డి, వెంకట్రాంరెడ్డి తదితరులు ఉన్నారు.
ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయి..
నిజాంపేట, ఏప్రిల్ 20 : సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని గాయత్రీ మాతను కోరుకున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం చల్మెడలోని గాయత్రీ మాత ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల క్షేమం కోసం అనునిత్యం పరితపించే వ్యక్తి కేసీఆర్ అని, ప్రజల ఆశీర్వాద బలమే ఆయనకు రక్ష అని ఆమె అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ సంపత్, కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్ కొండల్రెడ్డి, నాయకులు ఉన్నారు.
సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలి
కొల్చారం, ఏప్రిల్ 20 : సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఎమ్మెల్యే మదన్రెడ్డి మండల కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల, కొల్చారం సర్పంచ్ కరెంటు ఉమ రాజాగౌడ్, ఎంపీటీసీ అరుణ కృష్ణగౌడ్, సొసైటీ చైర్మన్ మనోహర్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొప్పోల్లో పూజలు
పెద్దశంకరంపేట, ఏప్రిల్20 : ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మంగళవారం దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కొప్పోల్ ఉమాసంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేశ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాములు, ఎంపీటీసీలు వీణా సుభాశ్గౌడ్, స్వప్న రాజేశ్వర్, తదితరులున్నారు.
సరస్వతీ మాతకు వేడుకోలు
వర్గల్, ఏప్రిల్ 20: విద్యాధరిణి క్షేత్రంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని సరస్వతీ మాతను వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాలుయాదవ్, ఎంపీపీ లతారమేశ్గౌడ్, వర్గల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు దేవగనిక నాగరాజు పాల్గొన్నారు.