వ్యవసాయ యూనివర్సిటీ : పంట దిగుబడిలో తక్కువ పెట్టుబడులు, అధిక లాభాలు పొందడంలో ప్లాస్టిక్ వినియోగం ఎంతో అవసరమని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ జగదీశ్వర్ అన్నారు. ప్రస్తుత వేసవి పరిస్థితులలో ఆయా మెట్ట పంటలకు మల్చింగ్ విధానం ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు మల్చింగ్ విధానం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. రాష్ట్రంలో మిర్చి, కూరగాయలు తదితర వాణిజ్య పంటలకు రైతన్న ఆరు గాలం కష్టించి, సకాలంలో పంటకు సరైన రీతిలో నీరందించక అనేక విధాలుగా నష్టపోతున్నారని గుర్తుచేశారు. సూక్ష్మ సాగుకి తోడ్పడే బిందు, తుంపర సేద్యంతో పాటు కూరగాయలు, పండ్ల ప్యాకింగ్ సంచులకు ప్లాస్టిక్ను ఉపయోగిస్తారు. అదే విధంగా వ్యవసాయ, ఉద్యాన సేద్య విభాగాలలో కూడా ప్లాస్టిక్ను ఉపయోగించొచ్చు.