న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు కరోనా సోకింది. ఆయనతోపాటు మరో సిబ్బందికి కూడా పాజిటివ్గా నిర్థారణ అయిందని కోర్టు వర్గాలు తెలిపాయి. జస్టిస్ చంద్రచూడ్ కరోనా నుంచి కోలుకుంటున్నారని వెల్లడించాయి. అయితే ఆయన నేతృత్వంలోని ధర్మాసనం కొన్ని రోజుల పాటు సమావేశం కాకపోవచ్చని కోర్టు వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు దేశంలో కరోనా సంక్షోభానికి సంబంధించిన అంశాలను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతున్నది. ఈ పిటిషన్లపై గురువారం విచారణ జరుగాల్సి ఉండగా ఆయన అందుబాటులో లేకపోవడంతో మరో తేదీకి వాయిదా పడవచ్చని తెలుస్తున్నది.