కంటోన్మెంట్, మార్చి 28 : అతివేగం, మద్యం మత్తుకు ఒకరు బలవ్వగా, మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. బైక్పై వేగంగా వెళ్తూ డివైడర్ను ఢీకొనడంతో యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్ఐ సుధాకర్రెడ్డి వివరాల ప్రకారం.. ఏపీ, అనంతపురంకు చెందిన భరత్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం నగరానికి వచ్చి.. బీరంగూడలో ఉంటూ ఓ యూట్యూబ్ చానల్ను నడుపుతున్నాడు. కర్నూల్ ఆదోనికి చెందిన పవన్ (20), అనంతపూర్కు చెందిన రాఘవేంద్ర (25) ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం నగరానికి వచ్చి ప్రస్తుతం న్యూ బోయిన్పల్లి చిన్నతోకట్టలో ఉంటున్నారు. ఈ నెల 27న రాత్రి భరత్.. పవన్, రాఘవేంద్రల రూంకు వచ్చాడు.
అక్కడ ముగ్గురు మద్యం తాగి.. అర్ధరాత్రి ముగ్గురు బైక్పై తాడ్బంద్ వైపునకు వెళ్తున్నారు. తాడ్ బంద్లోని మూలమలుపు వద్ద డివైడర్కు ఢీకొట్టారు. ఈ ఘటనలో పవన్ తలకు తీవ్ర గాయాలు కాగా భరత్, రాఘవేంద్రలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం పవన్ను తొలుత రెండు ప్రైవేటు దవాఖానలకు తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పవన్ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.