త్వరలో నోటిఫికేషన్
నేడు ఓటర్ల తుది జాబితా
14వ తేదీన పోలింగ్ కేంద్రాల ప్రకటన
డివిజన్లరిజర్వేషన్పై ఉత్కంఠ ఏ క్షణమైనా నోటిఫికేషన్..
ఖమ్మం ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. నగర పాలక సంస్థకు ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా అధికారులకు ఇటీవల సంకేతాలు ఇచ్చింది. దీంతో ఖమ్మం నగర మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి నేతృత్వంలో ఎన్నికల కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.ఇప్పటికే వార్డుల విభజన పూర్తికావడంతో తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వివరాలను ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తుది ఓటర్ల జాబితా ఈ నెల 11వ తేదీన ప్రకటించనుండగా.. నగర పాలక సంస్థ పరిధిలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నది. నగరపాలక సంస్థ ఎన్నికలకు ఏ క్షణమైనా నోటిఫికేషన్ జారీ చేసి అవకాశం ఉంది. అయితే, పెరిగిన ఓటర్లకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు పక్రియను పూర్తి చేశారు.
నగర పాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లకు 2016లో ఎన్నికలు జరిగాయి. పలు గ్రామాలు నగరపాలక సంస్థలో విలీనం కావడం నగర జనాభా పెరగడంతో ప్రభుత్వం డివిజన్ల విభజన ప్రక్రియను చేపట్టి పూర్తి చేసింది. దీంతో పెరిగిన ఓటర్లకు అనుగుణంగా నగర పాలక సంస్థ పరిధిలో ఈ సారి పోలింగ్ కేంద్రాలూ పెరగనున్నాయి. గత నగర పాలక సంస్థ ఎన్నికల్లో 285 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెరిగిన ఓటర్లు, కొవిడ్ నిబంధనల దృష్ట్యా మరో 60 నుంచి 70 పోలింగ్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. గత నగర పాలక సంస్థ ఎన్నికల తరహాలో కాకుండా కొవిడ్ కారణంగా ఈ సారి ప్రతి పోలింగ్ కేంద్రంలో పరిమిత సంఖ్యలో ఓటర్లు ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. తుది ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల ప్రకటన అనంతరం డివిజన్ల వారీగా రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు.
డివిజన్ రిజర్వేషన్లపై ఉత్కంఠ
డివిజన్ల రిజర్వేషన్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే రిటర్నింగ్ అధికారి.. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. వీరికి ఈ నెల 12వ తేదీన ఎన్నికల నిర్వహణపై హైదరాబాద్లో శిక్షణ ఇవ్వనున్నారు.
పెరిగిన ఓటర్లు..
2016లో జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికలతో పోల్చుకుంటే ప్రస్తుతం ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో 2,05,710 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం 2,81,387కు పెరిగింది. పెరిగిన ఓటర్లకు అనుగుణంగా మున్సిపల్ అధికారులు పోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
చెన్నైతో మ్యాచ్కు ఆ ముగ్గురు స్టార్లు దూరం
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత