వ్యవసాయం ప్రాధాన్యం, ఆవశ్యకతను నేటి తరానికి తెలియజేస్తూ తెరకెక్కించిన చిత్రం శ్రీకారం. శర్వానంద్, ప్రియాంకా ఆరుళ్ మోహన్, రావు రమేశ్, నరేశ్ కీలక పాత్రల్లో నటించారు. నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి టాక్తో ప్రదర్శించబడుతుంది. ఈ సినిమా విడుదల సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు రావు రమేశ్. గమ్యం తర్వాత శర్వానంద్తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. శర్వానంద్ తండ్రి పాత్ర చేయడం ఆనందంగా ఉంది.
రావు రమేశ్ వ్యవసాయం గురించి చెప్తూ..సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చేముందు చెన్నైలో వ్యవసాయం చేశా. అప్పుడు నేను పుట్టగొడుగులు సాగు చేశాను. అయితే సాగు చేస్తున్నపుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. మొత్తానికి సాగు ద్వారా వచ్చిన పంటతో ఒక్క రూపాయి కూడా రాలేదు. వ్యవసాయంలో నేను ఫెయిల్యూర్ను. వ్యవసాయం అంత సులభమైన విషయం కాదు. అయితే వ్యవసాయాన్ని లాభదాయకం చేస్తున్నవారు చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చాడు రావు రమేశ్. ఈ చిత్రంలో శర్వానంద్, రావు రమేశ్ తండ్రీ కొడుకులుగా నటించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.