న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ దృష్ట్యా నాలుగు రోజుల ముందుగానే వేసవి సెలవులు ఇవ్వాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయించారు. క్యాలెండర్ ప్రకారం మే 14 నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు. కానీ బార్ అసోసియేషన్ సభ్యుల వినతి మేరకు మే 10 నుంచి జూన్ 28వ తేదీ వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏప్రిల్ 26న బార్ అసోసియేషన్ సభ్యులు వేసవి సెలవుల అంశంపై సీజేఐకి ఓ వినతిపత్రం సమర్పించారు. ఢిల్లీలో కరోనా కేసులు అధికమవుతున్న తరుణంలో షెడ్యూల్ కంటే ముందుగానే సెలవులు ప్రకటించాలని సీజేఐని వారు కోరారు.