బెంగళూరు: కర్ణాటక సీఎం పదవికి బీఎస్ యెడియూరప్ప సోమవారం రాజీనామా చేయడంతో ఆయన సొంతూరు ప్రజలు నిరాశ చెందారు. శివమొగ్గ జిల్లాలోని షికారిపురలో యెడియూరప్ప మద్దతుదారులు సోమవారం స్వచ్ఛందంగా షాపులు మూసి బంద్ పాటించారు. అనంతరం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ అధిష్ఠానం యెడ్డీతో బలవంతంగా సీఎం పదవికి రాజీనామా చేయించిందని సొంతూరు షికారిపురలో ఆయన మద్దతుదారులు మండిపడ్డారు. యెడియూరప్పకు అనుకూలంగా, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు సీఎం పదవికి యెడియూరప్ప రాజీనామా చేయడంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి అనిశ్చితి నెలకొన్నది.