ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని కొవిడ్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఐసీయూ, ఆక్సిజన్ సౌకర్యం ఉన్న ఆస్పత్రుల్లో పడకల కొరత వేదిస్తుంది. 69 ఆస్పత్రులు పూర్తిగా నిండినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వెంటిలేటర్స్ సౌకర్యంతో కూడిన కొవిడ్-19 ఐసీయూ బెడ్స్ కలిగిన మొత్తం 94 ఆస్పత్రుల్లో 69 పూర్తిగా నిండిపోయాయి. ఇంకా 79 పడకలు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు 110 ఆస్పత్రుల్లోని 75 ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు లేని కొవిడ్-19 ఐసీయూ బెడ్స్ సైతం రోగులతో నిండినట్లు వెల్లడించారు. మొత్తం 1,177 వెంటిలేటర్స్తో కూడిన కొవిడ్ ఐసీయూ బెడ్స్లో 79 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. వెంటిలేటర్స్ సౌకర్యం లేని 2,130 కొవిడ్ ఐసీయూ బెడ్స్లో 348 బెడ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. మొత్తంమీద 13,680 పడకల్లో 9,041 బెడ్స్ కొవిడ్ రోగులతో నిండినట్లు అధికారులు పేర్కొన్నారు.