హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు జూబ్లీహిల్స్ పోలీసులు అనుమతి నిరాకరించారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ ఫంక్షన్కు అనుమతి ఇవ్వమని పోలీసులు స్పష్టం చేశారు. యూసుఫ్గూడ పోలీస్ లైన్స్లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్లో ఏప్రిల్ 3వ తేదీన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి ఆ సినిమా నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో నిర్వాహకులు, అభిమానులు షాక్కు గురయ్యారు.
ఈ ఈవెంట్కు 5 నుంచి 6 వేల మంది హాజరవుతారని నిర్వాహకులు అర్జున్, ప్రశాంత్ తమకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కొవిడ్ నిబంధనలపై ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతులు కుదరవని స్పష్టం చేశారు. వకీల్ సాబ్ వేసవి వినోదంగా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్న స్పీకర్ పోచారం