మహబూబ్నగర్ : వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటో అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కొత్తకోట మండలం కడుకుంట్ల వద్ద మంగళవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతులను అనంతపురం జిల్లా పుట్టపర్తి వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.