ఛండీఘడ్ : శిరోమణి అకాలీదల్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు మంగళవారం స్వయంగా ఆయనే ప్రకటించారు. ‘నేను కరోనా బారినపడ్డానని అందరికీ తెలియజేస్తున్నా. నా ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది. నిబంధనల మేరకు హోంఐసోలేషన్లో ఉంటున్నా. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, ఐసోలేషన్లో ఉండాలి’ అని సుఖ్బీర్ సింగ్ బాదల్ ట్విట్టర్లో కోరారు. సోమవారం ఆయన తరన్ తరన్లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.