కోల్కతా : పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్పై కాషాయ పార్టీ వేటు వేసింది. ఘోష్ స్ధానంలో ఎంపీ సుకంత మజుందార్ను పార్టీ బెంగాల్ చీఫ్గా నియమించింది. పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్ష బాధ్యతను దిలీప్ ఘోష్కు అప్పగించింది. పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో టీఎంసీలో చేరుతూ బెంగాల్లో బీజేపీ ఓటమికి దిలీప్ ఘోష్ కారణమని ఆరోపించిన నేపథ్యంలో ఘోష్కు బీజేపీ ఉద్వాసన పలకడం గమనార్హం.
ఎన్నికల ప్రచారం సందర్భంగా ఘోష్ చేసిన వ్యాఖ్యలు విద్యాసాగర్, రవీంద్రనాధ్ ఠాగూర్, సత్యజిత్ రేల సంస్కృతికి భిన్నంగా ఉన్నాయని, దీంతో బెంగాలీలు పార్టీతో కనెక్ట్ కాలేకపోయారని బాబుల్ సుప్రియో ఆరోపించారు. బెంగాల్ ఎన్నికలకు ముందు బీజేపీలోకి అసంబద్ధంగా వలసలను ప్రోత్సహించడం కూడా ఎన్నికల్లో పార్టీ సామర్ధ్యంపై ప్రతికూల ప్రభావం చూపిందని అన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ నుంచి పాలక టీఎంసీలోకి వలసల నేపథ్యంలో పార్టీ ప్రక్షాళనకు కాషాయ పార్టీ పూనుకుంది.