న్యూఢిల్లీ, మే 12: బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూజ్ క్షిపణికి ఎక్సటెండెడ్ వెర్షన్ను సుఖోయ్ యుద్ధ విమానం నుంచి బంగాళాఖాతంలో గురువారం భారత్ విజయవంతంగా పరీక్షించింది. శత్రువులపై ఎదురుదాడి చేసే విషయంలో ఇది చాలా వ్యూహాత్మకంగా పనిచేయనుంది. ఎస్యూ-30 ఎంకేఐ ఎయిర్క్రాఫ్ట్ నుంచి బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారని రక్షణ శాఖ వెల్లడించింది. దీని రేంజ్ను 350 కి.మీ. వరకు పెరిగిందని తెలిపింది.