మెదక్ : మెదక్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. సరదాగా చెరువులో చేపల వేటకు వెళ్లి నీట మునిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
రంగాయిపల్లికి చెందిన ఇద్దరు శివారులోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యారు.
స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా వీరిలో ఒకరి మృతదేహం లభించింది. మరొకరు మృతదేహం కోసం గాలింపు కొనసాగుతుంది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.