న్యూఢిల్లీ, జూన్ 21: కరోనా టీకా కొవాగ్జిన్ తయారీదారైన హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ మూడో దశ ట్రయల్స్ డాటాను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు (డీసీజీఐ) అందజేసింది. దేశంలో వినియోగిస్తున్న మూడు కరోనా టీకాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన టీకా కొవాగ్జిన్ ఒక్కటే. కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాల విడుదలలో జాప్యంపై భారత్ బయోటెక్పై విమర్శలు వచ్చాయి. ఫేజ్-1,2 ట్రయల్స్ ఆధారంగా కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి గతంలో డీసీజీఐ అనుమతులు ఇచ్చింది.