వాషింగ్టన్ : పోషకాహార లోపంతో బాధపడే వారు కొవిడ్-19 బారినపడితే వారిలో మరణించే అవకాశం, వెంటిలేషన్పై చికిత్సకు దారితీసే ముప్పు అధికమని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. పోషకాహారలోపం వ్యక్తి రోగనిరోధక వ్యవస్ధ పనితీరును నిరోధిస్తుందని తీవ్ర ఇన్ఫెక్షన్లకు గురయ్యే ముప్పును పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. పోషకాహార లోపం , కొవిడ్-19 తీవ్రతకు మధ్య సారూప్యాన్ని లూయిస్ ఎరంపియ ఆయన సహచరులు ఈ అధ్యయనంలో కనుగొన్నారు.
గత ఏడాది మార్చి-జాన్ మధ్య కరోనాతో అమెరికాలో ఆస్పత్రిపాలైన 8604 మంది చిన్నారులు, 94,495 మంది వయోజనుల మెడికల్ రికార్డులను పరిశీలించి ఈ వివరాలు రాబట్టారు. 2015-19 మధ్య పోషకాహారలోపంతో బాధపడిన వారిని ఈ లోపం లేనివారితో పోల్చిచూశారు. వీరిలో గతంలో పోషకాహార లోపానికి గురైనవారిలో అధిక మరణాలు సంభవించగా మరికొందరు కరోనా తీవ్ర లక్షణాలతో బాధపడినట్టు గుర్తించారు.