కవాడిగూడ, మే 1 : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం ముషీరాబాద్, భోలక్పూర్ ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించి అక్కడ జరుగుతున్న కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ తదితర విషయాలను ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దవాఖానలో మెరుగైన వైద్యం అందించాలని ఆయన సిబ్బందికి సూచించారు. కొవిడ్ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ ఒకే దగ్గర చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దవాఖాన సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే వేర్వేరుగా చేపట్టాలని ఆయన అన్నారు. దవాఖానలకు వచ్చిన వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ, నాయకులు మహ్మద్అలీ, ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాస్రావు, ఉపాధ్యక్షుడు బింగి నవీన్కుమార్, రహీం, శంకర్ గౌడ్, లక్ష్మీగణపతి దేవాలయం చైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, శ్రావణ్, కేఎం సాయి, డాక్టర్ కృష్ణమోహన్ రావు, దవాఖాన సిబ్బంది పాల్గొనగా పద్మశాలీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్. ఆంజనేయులు తన స్వంత ఖర్చులతో దవాఖాన ప్రాంగణంలో ఫ్లోరింగ్ ఏర్పాటు చేయడంతో ఆయనను ఎమ్మెల్యే ముఠా గోపాల్ షాలువాతో ఘనంగా సత్కరించారు.