ముంబై ,మే 5: ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమై, అదే దూకుడు కొనసాగించాయి. అందుకు ప్రధాన కారణం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ షెడ్యూల్ లేనప్పటికీ మీడియా ముందుకు వస్తారని వార్తలు రావడమే. ఈ కారణంగానే ఇవాళ సూచీలు సానుకూలంగా కదిలాయి. ఆర్బీఐ గవర్నర్ మీడియాతో మాట్లాడే సమయంలోను సెన్సెక్స్, నిఫ్టీ పైపైకి లేచాయి. ఉదయం నుంచి స్వల్పంగా, పైకి కిందకు కదిలినప్పటికీ, మొత్తానికి భారీ లాభాల్లోనే కొనసాగాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగియగా.. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి. కానీ కేంద్రం చర్యలు, ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో సానుకూలంగా కదిలాయని ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు.