కటక్: అధికారులు ఎన్ని కఠిన చర్యలు చేపడుతున్నా దేశంలో అలుగు (పంగోలిన్)ల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. తాజాగా ఒడిశాలో ఓ వ్యక్తి అలుగును అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు. ఒడిశా రాష్ట్రం కటక్ జిల్లా అభిమాన్పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడి ఇంటిపై రైడ్ చేసిన స్పెషల్ టాస్క్ఫోర్స్ అధికారులు.. పంగోలిన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతనిపై భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్లతోపాటు, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. పంగోలిన్ను జిల్లా అటవీ అధికారులకు అప్పగించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 2,34,692 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 4446 కరోనా కేసులు
నటుడు సోనూసూద్కు కరోనా పాజిటివ్
వ్యాధినిరోధక శక్తిని పెంచే ఈ ఆహార పదార్థాల గురించి తెలుసా..?
కోవిడ్పై పోరాటానికి కుంభమేళా ఓ ప్రతీకగా నిలవాలి : ప్రధాని మోదీ
కోడిగుడ్డులో పచ్చసొనను పడేస్తున్నారా.. అయితే ఇది చదవాల్సిందే..!
పాదాల పగుళ్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!