అహ్మదాబాద్, జూన్ 13: గుజరాత్కు చెందిన అనిల్ మెహతా (48) అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్కు బీపీ, షుగర్ వంటి సమస్యలేమీ లేవు. అయితే, ఇటీవల కొవిడ్-19 సోకి, కోలుకున్న మెహతాకు మధుమేహం వచ్చినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. తీవ్రమైన కొవిడ్-19 నుండి కోలుకున్న వారిలో మధుమేహం వంటి సమస్యలు తలెత్తుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. స్టెరాయిడ్ల వాడకం దీన్ని మరింత తీవ్రతరం చేస్తున్నట్టు పేర్కొంటున్నారు. ‘దవాఖానల్లో కొవిడ్ చికిత్స తీసుకున్న 14.4 శాతం రోగుల్లో మధుమేహం వ్యాధి ఉన్నట్టు తేలింది. కరోనా వల్ల కోటి మంది షుగర్ రోగులు కొత్తగా పుట్టుకొస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు’ అని ఎండోక్రినాలజిస్ట్ సంజీవ్ పటక్ తెలిపారు.