అడ్రస్ ప్రూఫ్ లేకున్నా వలస కార్మికులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్
న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఉజ్వల 2.0 పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ పథకంలో వలస కార్మికులు అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్ పొందవచ్చు. వారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలు. 2016లో ప్రారంభించిన ఉజ్వల 1.0లో 8 కోట్ల మంది పేదలకు ఉచితంగా 8 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని ప్రధాని తెలిపారు. తొలుత యూపీలో లబ్ధిదారులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎల్పీజీ సిలిండర్లు, స్టౌలను అందజేశారు.