చెన్నై: తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ప్రధాని నరేంద్ర మోదీకి గురువారం లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్లు, ఇతర ఔషధాలపై జీఎస్టీని తొలగించాలని కోరారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలే సమకూర్చుకుంటున్నాయని తెలిపారు. దీంతో వీటిని కొంత కాలం జీఎస్టీలో చేర్చకుండా జీఎస్టీ మండలితో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని అడిగారు. అలాగే పెండింగ్లో ఉన్న జీఎస్టీ పరిహారం బకాయిలు చెల్లించాలని, బియ్యం సబ్సిడీతోపాటు తమిళనాడు రుణ పరిమితులను రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (ఎస్జీడీపీ) లో 3% నుండి 4 శాతానికి పెంచాలని ప్రధాని మోదీని స్టాలిన్ లేఖ ద్వారా కోరారు.