ఢిల్లీ : కొవిడ్-19 ఉధృతి నేపథ్యంలో మే 29 నుండి జూన్ 7 వరకు జరగాల్సిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) పరీక్షను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) వాయిదా వేసింది. అదేవిధంగా మే నుండి జరగాల్సిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (సీహెచ్ఎస్ఎల్) పరీక్షను కూడా ఎస్ఎస్సీ వాయిదా వేసింది. అలాగే మే మొదటి వారంలో జరగాల్సిన సీఏపీఎఫ్కు చెందిన కానిస్టేబుల్(జీడీ) రిజిస్ట్రేషన్ను, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ పరీక్షను ఎస్ఎస్సీ వాయిదా వేసింది.