శ్రీపాదనాయక్కు ప్రాణాపాయం లేదు: రాజ్నాథ్ సింగ్

పనాజీ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గోవాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీపాద నాయక్కు ప్రస్తుతం ప్రాణాపాయం ఏమీ లేదని రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ తెలిపారు. గత రాత్రి ప్రమాదం జరిగిన వెంటనే తాను గోవా ముఖ్యమంత్రికి ఫోన్చేసి వివరాలు తెలుసుకున్నానని, ప్రధాని మోదీ కూడా గోవా సీఎంతో మాట్లాడారని వెల్లడించారు. ఆ తర్వాత పీఎం తనకు కూడా ఫోన్చేసి ఘటనపై విచారం వ్యక్తపర్చారని, అదేవిధంగా గోవాకు వెళ్లి పరిస్థితిని సమీక్షించమని తనకు సూచించారని రాజ్నాథ్ చెప్పారు.
ప్రధాని సూచన మేరకు గోవాకు వెళ్లిన రాజ్నాథ్ సింగ్.. రాశ్రీపాదనాయక్ పరిస్థితి నిలకడగానే ఉన్నదని, ఆయనకు ప్రస్తుతం ప్రాణాపాయం ఏమీలేదని వైద్యులు చెప్పారని వెల్లడించారు. శ్రీపాదనాయక్కు చికిత్స అందిస్తున్న వైద్యులతో ఎయిమ్స్ డైరెక్టర్ ఎప్పటికప్పుడు సంప్రతింపులు జరుపుతున్నారని, ఎయిమ్స్ నుంచి ఒక వైద్య బృందం కూడా గోవాకు రానుందని ఆయన తెలిపారు. ఇంకా అవసరమైతే శ్రీపాదనాయక్నే ఢిల్లీలోని ఎయిమ్స్ తరలించి చికిత్సి చేయిస్తామని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- నిర్మాత దొరస్వామి రాజు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- రామమందిర నిర్మాణానికి అక్షయ్ విరాళం
- కేసులతో విసిగి హిస్టరీ షీటర్ ఆత్మహత్య
- స్వచ్ఛ సిద్దిపేటే లక్ష్యం : మంత్రి హరీష్ రావు
- శాంసంగ్ కంపెనీ వైస్ చైర్మన్కు 2.5 ఏళ్ల జైలుశిక్ష
- వికారాబాద్లో రైలు ఢీకొని వ్యక్తి మృతి
- నా గురించే ఆలోచిస్తున్నావా చైతూ: సమంత
- అలెక్సీ నవాల్నీని అరెస్టు చేసిన రష్యా
- తెలంగాణలో శబరిమల...ఎక్కడో తెలుసా...?
- బేగంపేటలో రోడ్డుప్రమాదం.. భారీగా ట్రాఫిక్జామ్