అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నిర్ణయాత్మక టీ20 మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. గత నాలుగు మ్యాచ్లకు భిన్నంగా ఈ మ్యాచ్లో ఆతిథ్య బ్యాట్స్మెన్ దుమ్మురేపారు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల సునామీ సృష్టించారు. ఆది నుంచి ఇంగ్లీష్ బౌలర్లను బెంబేలెత్తించిన టీమిండియా అనూహ్యమైన స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా 20 ఓవర్లలో 2 వికెట్లకు 224 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ(64: 34 బంతుల్లో 4ఫోర్లు, 5సిక్సర్లు), విరాట్ కోహ్లీ(80 నాటౌట్: 52 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) సూపర్ అర్ధశతకాలతో విజృంభించగా సూర్య కుమార్ యాదవ్(32: 17 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), హార్దిక్ పాండ్య(39 నాటౌట్: 17 బంతుల్లో 4ఫోర్లు,2సిక్సర్లు) ధనాధన్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. బంతిని ఎలా వేసినా బౌండరీ బాదాలనే కసితో బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి బౌలర్లకు భయం పుట్టించారు. ఆరంభం నుంచి మంచి భాగస్వామ్యాలను నెలకొల్పిన భారత్ తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లాండ్ బౌలర్లలో అదిల్ రషీద్, బెన్ స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు. మార్క్ వుడ్, క్రిస్ జోర్డాన్ చెరో నాలుగు ఓవర్లు వేసి 50కి పైగా పరుగులు సమర్పించుకున్నారు.