రామేశ్వరం, మార్చి 25: తమ దేశ ప్రాదేశిక జలాల్లో చేపలను వేటాడుతున్నారన్న కారణంతో తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన 54 మంది మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం బుధవారం రాత్రి అరెస్టు చేసింది. మత్స్యకారులకు చెందిన 5 పడవలను స్వాధీనం చేసుకుంది. శ్రీలంక నౌకాదళం అదుపులో ఉన్న జాలర్లను విడుదల చేయాలని మత్స్యకారుల సంఘాలు కోరాయి. ఇందుకు కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.