న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ తొలి బ్యాచ్ టీకాలు మే 1న భారత్కు చేరనున్నాయి. ఈ విషయాన్ని ఆర్డీఐఎఫ్ హెడ్ కిరిల్ దిమిత్రీవ్ తెలిపారు. అయితే ఎన్ని డోసులు పంపిస్తారన్న విషయం ఆయన చెప్పలేదు. వేసవి చివరికి భారత్లో నెలకు 5 కోట్ల డోసులు ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయని తెలిపారు. స్పుత్నిక్ వీ ఉత్పత్తికి ఆర్డీఐఎఫ్ ఇప్పటికే భారత్కు చెందిన ఐదు కంపెనీలతో ఒప్పందం చేసుకొన్నది. స్పుత్నిక్ వీ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఇటీవలే అనుమతినిచ్చింది. ఇదిలా ఉండగా, స్పుత్నిక్ వీ మొదటి లాట్ తమకు మే చివర్లో రావొచ్చని రెడ్డీస్ ల్యాబ్ మంగళవారం తెలిపింది.