న్యూఢిల్లీ : దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్నది. సామాన్యు నుంచి సెలబ్రెటీల వరకు ఎవ్వరినీ మహమ్మారి వదలడం లేదు. తాజాగా ఇవాళ కేంద్ర క్రీడలశాఖ మంత్రి కిరణ్ రిజిజు కరోనా బారినపడ్డారు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. వైద్యుల సలహా తీసుకొని అందుకు అనుగుణంగా చికిత్స తీసుకుంటున్నట్లు రిజిజు తెలిపారు.
ఇటీవల తనను కలిసిన వారు పరీక్ష చేయించుకొని క్వారంటైన్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రిజిజు ఉత్తరాఖండ్లోని తెహ్రీలో వాటర్స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ ఇనిస్టిట్యూట్ను ప్రారంభించారు.
ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న ఆ రాష్ట్ర సీఎం తిరత్సింగ్ రావత్ సైతం ఈ ప్రారంభోత్సవ వేడుకలో రిజిజుతో కలిసి పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి