శ్రీనగర్ : దక్షిణా కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. పుల్వామాలోని ఘాట్ మొహల్లా కాకపోరా ప్రాంతంలో ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఈ మేరకు అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకొని కార్డన్ సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించాయి. సైన్యంతో పాటు సీఆర్ఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాల్పులు చోటు చేసుకోగా.. ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ప్రస్తుతం భద్రతా బలగాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.