హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ):
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఆధ్వర్యంలో రూపొందించిన 2-డీజీ (2-డియాక్సీ-డి-గ్లూకోజ్) ఔషధం కరోనాపై అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నదని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ జీ సతీశ్రెడ్డి తెలిపారు. ఆక్సిజన్, వెంటిలేటర్ల అవసరం పెద్దగా లేకుండానే రోగి వేగంగా కోలుకుంటున్నట్టు చెప్పారు. త్వరలోనే ఇది బహిరంగ మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని, వివిధ కంపెనీలు తయారు చేస్తున్నాయని తెలిపా రు. తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య మండ ళ్ల సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం 2-డీజీపై వెబినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సతీశ్రెడ్డి మాట్లాడుతూ.. రక్షణ రంగానికీ, మందుల తయారీకి ఉన్న సంబంధం గురించి తరచుగా అడుగుతుంటారని, తాము రక్షణ దళాల కోసం అనేక ఉత్పత్తులు రూపొందిస్తామన్నారు. అందులోభాగంగా కెమికల్, బయలాజికల్ రంగాలపై పరిశోధనలు జరుగుతాయని తెలిపారు. రేడియేషన్ ప్రభావాన్ని తట్టుకొనేందుకు రూపొందించిన ఔషధాన్ని 13 ఏండ్ల క్రిత మే రెండు దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని చెప్పారు. సీసీఎంబీ మాజీ డైరెక్టర్ రాకేశ్మిశ్రా సహకారంతో కరోనా వైరస్పై ఈ ఔషధం ఎలా పనిచేస్తుందో పరిశోధనలు నిర్వహించామన్నారు. మెరుగైన ఫలితాలు రావడంతో మూడోదశ ట్రయల్స్ నిర్వహించినట్టు తెలిపారు. ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి అనుమతు లు తీసుకొన్నామన్నా రు. గత మేలో దేశంలోని 40 దవాఖానల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రోగులు, మామూలు రోగులపై ప్రయోగించామని చెప్పారు. దాదాపు అందరూ కోలుకొన్నారని చెప్పారు. దీంతో రక్షణ మం త్రి, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి చేతులమీదుగా అధికారికంగా ఔషధాన్ని ఆవిష్కరించామని వెల్లడించారు. రెడ్డీస్ ల్యాబ్ ఇప్పుడు 2-డీజీ ఉత్పత్తిని చేపట్టిందని చెప్పారు. దేశవ్యాప్తంగా పంపిణీకి చర్యలు తీసుకొంటున్నామని పేర్కొన్నారు.
అనేక రకాల ఉత్పత్తులు
డీఆర్డీవోలో మందులే కాకుండా రక్షణ దళాలకోసం అనేక ఇతర పరికరాలను తయారుచేస్తామని సతీశ్రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఆన్బోర్డ్ ఆక్సిజన్ జనరేషన్ సిస్టంను రూ పొందించామని చెప్పారు. విమానం ఆక్సిజన్ అందనంతఎత్తుకు ఎగిరినప్పుడు పైలెట్కు అక్కడే ఆక్సిజన్ తయారుచేసే వ్యవస్థను రూపొందించామన్నారు. నిమిషానికి 960 లీటర్ల ఆక్సిజన్ తయారుచేసే ప్లాంట్ను రూపొం దించామని చెప్పారు. దళాల కోసం తయారు చేస్తున్న వస్తువులన్నీ సామాన్యులకు అందుబాటులోకి తెస్తామన్నారు.
దళాలకు అవసరమైనవన్నీ తయారు
రక్షణ దళాలు రేడియేషన్ను తట్టుకునేలా తయారుచేసిన మాస్కులు, పీపీఈ కిట్లను ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా తీర్చిది ద్దామని సతీశ్రెడ్డి తెలిపారు. మైసూర్లో తాము ఐసీయు వెంటిలేటర్లను తయారుచేసినట్టు చెప్పారు. రెడ్డీస్ ల్యాబ్స్ సీఈవో దీపక్సప్రా, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అనంత్ నారాయణభట్ వెబినార్లో పాల్గొన్నారు.